పొలిటికల్ ఐ: ప్రముఖ ఐటీ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.ఇది వినగానే ఎవరైనా అవును అనే అంటారు..ప్రస్తుతం ప్రపంచమంతా కారోనో వైరస్ తో సతనతమౌతున్న విషయం తెలిసిందే దింతో ఐటీ కంపెనీ లు అన్ని వర్క్ ఫ్రొమ్ హోమ్ ప్రకటించాయి. అయితే, కరోనా తగ్గితే తిరిగి ఉద్యోగులను కార్యాలయాలకు రమ్మని పిలవాలని భావిస్తున్నాయి. కానీ ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ మాత్రం తమ కంపెనీల్లో పనిచేస్తోన్న హార్డ్వేర్ ల్యాబ్స్, డేటా సెంటర్లు, శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే ఉద్యోగులు మినహా ఇతర ఉద్యోగులు ఇకపై శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చని తెలిపింది.
సగం కానీ, అంతకంటే తక్కువ పనిదినాల్లో కానీ ఈ వర్క్ ఫ్రం హోం ఇస్తామని వివరించింది. ఆయా విభాగాల మేనేజర్లతో ఉద్యోగులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో ఉద్యోగులు వారి నివాస స్థలాల్ని కూడా మార్చుకునే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. అమెరికాలో వారి సొంత ప్రదేశాలకు వెళ్లి పనిచేసుకోవచ్చని, అలాగే, విదేశీయులు తమ సొంత దేశాలకు కూడా వెళ్లి పనిచేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. అయితే, వేతనాల్లో కాస్త మార్పులు ఉంటాయని తెలిపింది. ఇందుకోసం మేనేజర్ నుంచి అనుమతి తప్పనిసరి తీసుకోవాలని చెప్పింది..