హైదరాబాద్: సెప్టెంబర్ ఏడో తారీకు నుంచి దశలవారీగా ప్రారంభంకానున్న మెట్రో రైలు సర్వీసులు. సెప్టెంబర్ 21 తేదీ నుంచి వందమంది కి లోబడి మతపరమైన వేడుకలకు అనుమతిస్తారు.
సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు మూసివేత కొనసాగింపు ఉంటుంది. రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల కు అనుమతి మేరకు 50 శాతం మంది తో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు ఒకే. ఉపాధ్యాయుల వద్ద సూచనలు/ మార్గదర్శకాలు పొందేందుకు 9 నుంచి 12వ తరగతి విద్యార్థుకు పాఠశాలకు వెళ్లేందుకు అనుమతి. సెప్టెంబర్ 21 నుంచి సామాజిక, విద్యా సంబంధిత, క్రీడా, వినోద, మత, రాజకీయ పరమైన ఫంక్షన్లకు వందమంది పరిమితితో అనుమతిస్తారు. స్విమ్మింగ్ పూల్స్, సినిమా థియేటర్ల పై సెప్టెంబర్ 30 వరకు నిషేధం కొనసాగిస్తారు.
అంతర్రాష్ట్ర సరుకు, ప్రజా రవాణాకు నిబంధనల పూర్తిస్థాయి తొలగింపు. కంటోన్మెంట్ జోన్లలో యధాతధంగా కొనసాగనున్న లాక్ డౌన్ నిబంధనలు.