పొలిటికల్ ఐ : బొంబాయి డ్రగ్ కేసులో ప్రదానంగా విచారణ జరుగుతున్న ప్రముఖ సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి మాజీ.ఎమ్యెల్యే సంపత్ కుమార్ విమర్శించారు.రకుల్ ప్రీత్ సింగ్ కేసులో హైదరాబాద్ కు లింకులు ఉన్నాయని ఆరోపించారు.దీని పై సమగ్ర విచారణ జరపాలని ఇక గతంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసు తొక్కేశారని గతంలో హైదరాబాద్ లో జరిగిన డ్రగ్స్ కుంభకోణంలో అనేక మంది సినీ, వ్యాపార ప్రముఖులు ఉన్నారని వారిపై రోజుల తరబడి విచారణ జరిపి తర్వాత ఎలాంటి చర్యలు లేకుండా తొక్కి పెట్టారని, ఇప్పుడు బొంబాయి డ్రగ్స్ మాఫియా కేసు లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందని ఆమె తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు.ఈ సమయంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసు లోతైన విచారణ జరిపితే ప్రభుత్వ పెద్దలు బాగోతలు బయట పడతాయని డిమాండ్ చేశారు.
Get real time updates directly on you device, subscribe now.