హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా.. 2,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.
ఇదే సమయంలో 9 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,670 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 770 కి చేరింది. ఇప్పటి వరకు 84,163 మంది కరోనా బారినుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,737యాక్టీవ్ కేసులున్నాయి.