పొలిటికల్ ఐ : తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ నూతన ఇంచార్జి మణికం ఠాగూర్ మొదటి సారి తెలంగాణ కు వచ్చారు.సెప్టెంబర్ 26 న ఠాగూర్ రాష్ట్రానికి వచ్చారు వచ్చిన మొదటి రోజే కోర్ కమిటీ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు కూడా ఉంది కాని ఆ మీటింగ్ కు జగ్గారెడ్డి అట్టెండ్ అవ్వలేదు.ఇక తర్వాత రోజు దుబ్బాక ఉప ఎన్నికల మీటింగ్ జరిగింది గాంధీభవన్ లో ఆ సమావేశనికి కూడా జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. ఇక సోమవారం సీఎల్పీ మీటింగ్ నిర్వహించారు అసెంబ్లీ లోని సీ ఎల్పీ కార్యాలయంలో. ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఇంచార్జి లో ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. ఈ సమయంలో ఇంచార్జి ఠాగూర్ కోర్ కమిటీ మీటింగ్ కు ఎందుకు రాలేదని, దుబ్బాక ఉప ఎన్నికల సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించినట్లు సమాచారం.ఇతే ఇంచార్జి ప్రశ్నలకు జగ్గారెడ్డి మౌనంగా ఉండిపోయారటా..! దింతో ఠాగూర్ సాబ్ తర్వాత ఇలా చేయొద్దని సమావేశాలకు హాజరుకావాలని చెప్పిన్నట్లు తెలుస్తోంది.ఇక జగ్గారెడ్డి పీసీసీ మార్పు ఇప్పట్లో చేయొద్దని చేస్తే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు..ఇక నేతలంతా మూడు సంవత్సరాలు ఫీల్డ్ లో ఉండేలా చూడాలని , రైతులను, నిరుద్యోగులను, ఎలా మనవైపు మలోచుకోవలో అనేదాని పై స్ట్రాటజీ చేయాలన్నారు..
Get real time updates directly on you device, subscribe now.
Next Post
You might also like