అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా(జాతీయ, అంతర్రాష్ట్ర వ్యవహారాల) సలహాదారు దేవులపల్లి అమర్ పై సీపీఐ ఏపీ అధ్యక్షుడు రామకృష్ణ విమర్శలు చేయడం పట్ల అమర్ తీవ్రంగా స్పందించారు.
ఈ సందర్భంగా అమర్ పలు వ్యాఖ్యలు చేశారు. సలహాదారులు ఇచ్చే సలహాలు ప్రజా ప్రయోజనకారిగా ఉంటాయని, ఆర్బాటంగా ప్రకటించే విధంగా ఉండవని, స్వంత ప్రయోజనం కోసం ఇచ్చేవి సలహాలు కావన్నారు. రామకృష్ణ ముందు తన పార్టీ(సీపీఐ)ని మెరుగు పర్చుకోమన్నారు. ఇందుకోసం సరైన సలహాదారులను ఎంచుకోమంటూ హితవు పలికారు.