పొలిటికల్ ఐ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మగాడు అనుకున్నానని…కానీ తన స్థాయిని తగ్గించుకుంటున్నారని విమర్శించారు.. ఇక గతంలో నేను చెప్పినట్టుగానే నాపై కొన్ని కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసిందని నన్ను చంపేస్తానని చెప్పిన వ్యక్తితోనే కేసులు పెట్టిస్తున్నారని.. నాకు తెలిసిన జగన్ రెడ్డి ఎంతో ధైర్యవంతుడు. ఆయన మగాడు.. మొనగాడు అనుకున్నాను. ఈ రకంగా స్థాయి తగ్గించుకుంటాడని అనుకోలేదని విమర్శించారు. ఉన్నతంగా ఉండాలని అనుకునేవాడిని… మీకు మీరు తగ్గించేసుకుంటారని అనుకోలేదని నాస్థాయి పెరుగుతుంది. ఇంకా పెరుగుతుంది. మీ స్థాయి తగ్గడం బాధగా ఉందన్నారు. మీ స్థాయిని తగ్గించుకోకండి. ఏదైనా ఉంటే ముఖాముఖి మాట్లాడుకుందాం. మీరు ప్రయోగించిన వాళ్లు చిన్నవాళ్లు కాదు. బ్రహ్మాస్త్రం ప్రయోగించారు కానీ ప్రజల దృష్టిలో మీరు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
Get real time updates directly on you device, subscribe now.
Next Post
You might also like