మొత్తం సిబ్బందిలో పదిశాతం మందికి పాజిటివ్
హైదరాబాద్: పోలీస్ శాఖలో కరోనా పాజిటివ్ కేసులు కలవర పెడుతున్నాయి. తెలంగాణ పోలీస్ శాఖలో మొత్తం 5,684 పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో 2,284 మంది డిశ్ఛార్జి కాగా, 3,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇప్పటివరకు 44 మంది పోలీసులు కరోనాకు బలయ్యారు. అమరులైన వారిలో కానిస్టేబుల్ మొదలు అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు ఉన్నారు.
తెలంగాణ పోలీసు డిపార్ట్ మెంట్ లో మొత్తం 54 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పనిచేస్తున్న వారిలో పది శాతం మందికి కరోన రావడం కలవరానికి గురి చేస్తున్నది. కరోనా కేసుల్లో హైదరాబాద్ కమిషనరేట్ టాప్ లో ఉంది.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,967 మంది కరోనా బారిన పడగా, అందులో 891 చికిత్స, 1053 మంది రికవరీ కాగా, 23 మంది చనిపోయారు. ఆ తర్వాత వరంగల్ కమిషనరేట్ లో 526 కేసులు ఉండగా, 361 మంది చికిత్స పొందుతున్నారు, 163 మంది డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు మరణించారు.