శ్రీనగర్: జమ్మూలో టీటీడీ నిర్మించ తలపెట్టిన దివ్యక్షేత్రం ( శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం) స్థలాన్ని టీటిడీ ఛైర్మన వైవి సుబ్బారెడ్డి బుధవారం పరిశీలించారు. అక్కడ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చింది.
దివ్యక్షేత్రం నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి బుధవారం జమ్ముకు వెళ్లి ఆలయ నిర్మాణం స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశిస్తామని చైర్మన్ అక్కడి అధికారులకు తెలిపారు.
జమ్మూ కలెక్టర్ సుష్మా చౌహాన్, జిల్లా అభివృద్ధి ఆదనపు కమిషనర్ రమేష్ చందర్, అడిషనల్ డిప్యూటి కమిషనర్ శ్యాం సింగ్, శ్రీ వైష్ణోదేవి ఆలయ బోర్డు సీఈఓ రమేష్ కుమార్ టీటీడీ చైర్మన్ వెంట ఉన్నారు.