పొలిటికల్ ఐ: ఓ పెట్రోల్ బంకు యాజమాన్యం తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెట్రోల్ నింపుకునే వినియోగదారులకు బిర్యానీ ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపింది.బెంగళూరు లోని ఓ పెట్రోల్ బాంక్ యాజమాన్యం తమ సేవలు ప్రారంభించి 50 ఏళ్లు నిండిన సందర్భంగా వినియోగదారుల పట్ల కృతజ్ఞత చాటుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీ వెంకటేశ్వర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సర్వీస్ స్టేషన్ నిర్వాహకులు వెల్లడించారు. ఓల్డ్ మద్రాసు రోడ్డులోని ఈ ఔట్లెట్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్య కాంప్లిమెంటరీ ఫుడ్ ప్యాకెట్లు అందిస్తామని తెలిపారు. నెల రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందనీ…వెజ్, నాన్వెజ్ వెరైటీలు రెండూ అందిస్తామన్నారు. అయితే ఫ్రీ బిర్యానీ అందించేందుకు ఈ ఫ్యూయల్ స్టేషన్ కొన్ని షరతులు కూడా పెట్టింది. వీటి ప్రకారం రూ.2 వేలు ఆపైన ఇంధనం నింపుకున్న వారికే బిర్యానీ ఫ్రీగా ఇస్తారు. దీంతో పాటు రూ.250 ఆపైన ఇంధనం నింపుకున్న వారికి కూడా ప్రోత్సాహక బహుమానాలు ఇవ్వనున్నారు.
Get real time updates directly on you device, subscribe now.
Prev Post
You might also like